Bigg Boss బిగ్ బాస్ సీజన్ 5 లో తనదైన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కంటస్టెంట్ ఉమాదేవి. గడిచిన వారం రోజుల్లో బిగ్ బాస్ లో బాగా కనిపిస్తున్న ఇంటి సభ్యులలో ఉమా కూడా ఒకరు. ఇంటి సభ్యులతో గొడవ పడటం, ఆడ, మగ తేడా లేకుండా అడ్డొచ్చిన వారందరిని నెట్టుకుంటూ గేమ్ ఆడడం… నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. కొన్ని సందర్భ;ల్లో ఎం మాట్లాడుతుందో ఆమె కన్నా అర్ధం అవుతుందా అనేలా ప్రవర్తించింది. దీనితో ఈ వారం ఎలిమినతె అయ్యే కంటెస్టెంట్ ఈమె అని అందరు బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపధ్యం లోనే ఆటలో బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి అనే మాట ఇప్పుడు నిజం అనిపిస్తుంది.
అయితే రెండో వారం నామినేషన్స్లో ఉమాదేవి , యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు ఉన్నారు. అయితే నామినేషన్స్ రోజు ఉమాదేవి హౌస్లో అందరి ముందు పచ్చి బూతులు మాట్లాడింది. ఆ మాటలకు ఇంటి సభ్యులతో పాటు… టీవీ చూస్తున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. అయితే ఇక్కడే అసలు ఆట మారిందని చెప్పాలి. గడిచిన ప్రతి ఎపిసోడ్ లోనూ ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇచ్చి… ఆమె పట్ల పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది.
లోబోతో కలిసి ఆమె చేస్తున్న కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. వీళ్లిద్దరి మధ్య ట్రాక్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో కూడా సిరితో కలిసి చేసిన అత్తా కోడళ్లు స్కిట్ నవ్వులు పూయించింది. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్కి లక్షల అభిమానులు ఉండటంతో… వీళ్లంతా భాగ్యంకి అండగా నిలవడంతో ఓటింగ్లో మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్లో ఉన్న తొలిరోజు… ఎవరు ఎలిమినేట్ అవుతారని పోల్ పెడితే దాదాపు 90 శాతానికి పైగా ఆడియన్స్ ఉమాదేవిని ఎలిమినేట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే శుక్రవారానికి వచ్చేసరికి ఓటింగ్ తలకిందులైంది.
ప్రస్తుతం ఓటింగ్ సరళి చూస్తే.. లోబోకి అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతుండగా.. అతని తరువాత స్థానంలో ప్రియాంక, ప్రియ, కాజల్లు ఉన్నారు. ఈ నాలుగురు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. మిగిలిన నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్లు డేంజర్లో జోన్లోకి వచ్చారు. గడిచిన వారం రోజుల్లో ఉమాదేవికి… స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వడంతో… బిగ్ బాస్ ఉమాదేవి పట్ల సానుకూలంగా ఉన్నట్టు స్పష్ఠం అవుతోంది. ఈ వారం ఎవరు ఎలిమినతె అవుతారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు ఆగక తప్పదు.