Kriti Shetty: ప్రముఖ సినీ నటి కృతి శెట్టి అంటే అందరికీ బాగా తెలుసు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అలాగే అందం అభినయంతో పాటు ప్రేక్షకులందరినీ తన నటనతో ఆకట్టుకుంది.
అంతేకాకుండా అతి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ల కన్నా ముందుగా సినీ పరిశ్రమలో దూసుకుపోయింది. అయితే ఉప్పెన సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా అక్కినేని నాగచైతన్య సరసన బంగార్రాజు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగారాయ్ అనే సినిమాలో నటించింది.
ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ సినిమాల తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. రామ్ తో నటించిన ది వారియర్, నితిన్ తో నటించిన మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
దీంతో ఈమె ఫ్లాప్ హీరోయిన్ గా మారిపోతుంది ఏమో అని ఆమె అభిమానులు కంగారు పడ్డారు. అయితే తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృతి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దీంతో అక్కడ సూర్యతో ఆమెకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కృతి శెట్టికి సినిమాల్లో అదృష్టం కొద్ది రోజులే ఉన్నట్టుంది. ఆ అవకాశం కూడా ఆమె చేతి నుండి జారిపోయింది.
ఏకంగా ఆ సినిమా నుండి సూర్య తప్పుకున్నాడు. దీంతో ఉన్న పెద్ద హీరో ప్రాజెక్ట్ కూడా కృతి శెట్టి చేతి నుండి జారుకుంది. అయితే శ్యామ్ సింగారాయ్ లో అలాగే బంగార్రాజులో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినప్పటికీ ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
అయితే శ్యామ్ సింగారాయ్, బంగార్రాజు లో ఆమె సెకండ్ హీరోయిన్ గా చేసినందుకు పలు విమర్శలు ఎదుర్కొంది. అయితే సెకండ్ హీరోయిన్ గా కాకుండా మెయిన్ హీరోయిన్ గా చేస్తేనే కృతిని చూస్తారు. కానీ సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఆమె అభిమానులు చూడలేకపోయారు. ఒకసారి అంటే కథ కథనాల ప్రకారం ఆమె ఒప్పుకుంది అనుకోవచ్చు కానీ మరో సినిమాలో కూడా ఆమె సెకండ్ హీరోయిన్ గా చేయబోతుందని తెలుస్తోంది.
అయితే విజయ్ దేవరకొండ సమంత నటిస్తున్న ఖుషీ సినిమాలో ఆమెకు సెకండ్ హీరోయిన్గా అవకాశం వచ్చిందట. దానికి ప్రతి శక్తి కూడా వెంటనే ఒప్పుకుంది. అయితే ఈ సినిమాలో సమంత మెయిన్ రోల్ పోషిస్తుంది. కానీ కృతి మాత్రం సెకండ్ హీరోయిన్ గానే అందరి అభిప్రాయంలో ఉంటుంది.
Kriti Shetty: ఫ్లాపులతో సతమతమవుతున్న హీరోయిన్ కృతి శెట్టి..
అయినప్పటికీ కూడా ప్లాపులు ఉన్నందువల్ల కృతి ఖుషీ సినిమాను ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే ఈమె పాత్ర ఆ సినిమాలో ఏమాత్రం తేడా కొట్టిన కూడా ఇక కృతికి హీరోయిన్గా అవకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోతాయనే చెప్పాలి. అయితే ప్రస్తుతం కృతి ఒక మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉంది.