Mahesh Babu- Namrata: ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ లో చాలా మంది హీరో హీరోయిన్ లు పెళ్లి చేసుకుంటున్నారు. సినిమాల్లో నటించి ఆ సమయం లో ప్రేమలో పడి ప్రేమించుకొని కొందరు పెద్ద వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటే మరి కొంత మంది పెద్ద వారికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుంటున్నారు.
పెళ్లి ఎలా చేసుకున్న కలిసుండాలి అనుకోకుండా చాలా మంది పెళ్లి అయిన కొన్ని ఏళ్లకే విడిపోతున్నారు. అయితే మరికొందరు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అలాంటి జంటల్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట కూడా. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మొదటి దశలో నమ్రత స్టార్ హీరోయిన్ హిందీ లో అప్పటికే చాలా సినిమాలు చేసింది.
అయితే తెలుగు లో వంశీ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ సమయం లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ పెళ్లి కు కారణం మహేష్ బాబు తల్లి ఇందిర దేవి గారు అంట. ఇటీవల ఇందిర దేవి గారు అనారోగ్యం తో మరణించిన విషయం తెలిసిందే.
అయితే మహేష్ బాబు పెళ్లికి మొదటిగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే కృష్ణ గారు మహేష్ ను ఒక తెలుగు అమ్మాయికి చెయ్యలనుకున్నరట. నమ్రత ముంబై కి చెందిన అమ్మాయి కావడం తో వాళ్ళ పెళ్లి కి కృష్ణ గారు తిరస్కరించారు.
Mahesh Babu- Namrata: మహేష్ నమ్రత పెళ్లి పై ఫైర్ అయిన సూపర్ స్టార్ కృష్ణ..
కానీ మహేష్ బాబు మాత్రం నమ్రత ను మర్చిపోలేక ముంబై కి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకున్నారు. దీంతో కృష్ణ గారు వారి మీద కోప్పడ్డారు. అయితే ఇందిర దేవి గారు కృష్ణ గారిని కూర్చోబెట్టి ఆయనను ఒప్పించారట. ఇక ఇందిర దేవి మాట విని కృష్ణ గారు అలాగే ఇందిర దేవి గారు ముంబై కి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు.