Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు. ఇక నాగార్జున వారసులుగా అక్కినేని అఖిల్, నాగచైతన్య ఇద్దరు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన అఖిల్ క్రమంగా తన గ్రాఫ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగచైతన్య అత్యంత విలాసవంతమైన ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటి కోసం నాగచైతన్య చేసిన ఖర్చు ప్రస్తుతం వైరల్ గా మారింది.
సమంతని వివాహం చేసుకున్న తర్వాత నాగచైతన్య ఆమెతో కలిసి జూబ్లీహిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసి అందులో నివాసం ఉండేవారు. కానీ సమంత నుండి విడిపోయిన తరువాత నాగచైతన్య ఆ ఇంటిని వదిలేశాడు. ఆ తర్వాత సమంత కూడా ఆ ఇంటిని అమ్ముకొని వేరొక ఇల్లు కొనుగోలు చేసింది. ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత కొంతకాలం తండ్రితో కలిసి జీవించిన నాగచైతన్య తాజాగా ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో నాగచైతన్యతను అభి రుచికి తగ్గట్టు ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు.
Nagachaitanya: విలాసవంతమైన ఇంటిని నిర్మించిన చైతన్య…
ఈ ఇంటిని తనకు నచ్చినట్లు డిజైన్ చేసుకున్నాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన అభి రుచికి తగ్గట్టుగా నాగచైతన్య ఇంటిని డిజైన్ చేయించుకోవడం కోసం దాదాపు రూ. 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాగచైతన్యకు ఈ ఇంటితో పాటు మరికొన్ని విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. మొత్తానికి సమంతకి దూరమైన తర్వాత ఇంత కాలానికి నాగచైతన్య తనకు నచ్చిన విధంగా ఒక ఇంటిని నిర్మించుకున్నాడు.