Bigg Boss బిగ్బాస్ తెలుగు సీజన్ 5 నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుంది. మూడో వారం ఎలిమినేషన్ లో శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి ఉన్నారు. వీరిలో శ్రీరామ్, మానస్ భారీ ఓట్లతో ఓటింగ్లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన లహరి, ప్రియ లలో కొద్ది ఓట్ల శాతం తేడాతో… లహరి ఇంటిని వీడనున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వారంలో రవి-ప్రియ-లహరిల మధ్య జరిగిన గొడవతో… లహరి మీద పూర్తిగా నెగెటివ్ మార్క్ పడిందని చెప్పాలి. యాంకర్ రవి – లహరిలు టాయిలెట్లోకి దూరి హగ్ చేసుకున్నారంటూ ప్రియ ఆరోపణలు చేయడం… ఆ గొడవ పెద్దది కావడం తెలిసిన విషయమే. అయితే నిజానికి ప్రియ నామినేషన్స్లోకి వచ్చిన రోజే ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఒక అమ్మాయి గురించి అందరి ముందు అలా… మాట్లాడటంతో ప్రియపై నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కూడా ఒక మహిళే కదా… అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది… రాత్రిపూట హగ్గులంటూ ఎలా చిత్రీకరించ గలిగింది… అని ప్రియాపై నెటిజన్లు మండిపడ్డారు.
ఎప్పుడైతే రవి… లహరి గురించి బ్యాడ్గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో… అప్పటి నుంచి ప్రియ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అర్దం అవుతుంది. ఈ నేపధ్యంలో రవి చెప్పడం వల్లే ఆమె… మాట్లాడిందంటూ ఆమె పట్ల ప్రేక్షకులకు పాజిటివ్ ఫీలింగ్ రావడం మొదలయ్యింది. దీంతో వీరి గొడవ కారణంగా లహరి ఎలిమినేట్ అవుతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్కోసారి ఈ ఓటింగ్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని కూడా ఎలిమినేట్….చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగక తప్పదు …