Telangana News: తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శల వ్యాఖ్యలు చేశారు. తాజాగా జగ్గా రెడ్డి సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సైలెంట్ గా ఉన్న చంద్రబాబు నాయుడును తెలంగాణకు వచ్చేలా చేసింది కేసీఆరే అని అన్నాడు. కేసీఆర్ పార్టీ పేరు మార్చి తెలంగాణ ప్రజలను అవమానించారు అని జగ్గారెడ్డి అన్నాడు.
కేసిఆర్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపించలేరు కానీ తెలంగాణలో చంద్రబాబు ప్రభావం చూపించగలరని అన్నాడు. ఇక కేసీఆర్ పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేయడంతో తెలంగాణ వాదాన్ని చంపేయటమే కాకుండా తన బలాన్ని కూడా కోల్పోయారు అని అన్నాడు.
కేసీఆర్ కు తన మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉంది అని అన్నాడు. ఇక రాజకీయ బతుకు నిచ్చిన చెట్టునే ఆయన నరికేశారు అంటూ కామెంట్ చేశాడు. కూటములు, పొత్తులపై భవిష్యత్తులో తెలుస్తుంది అంటూ ఇకపై రాష్ట్రంలో రాజకీయాలు దశవంతరంగా ఉంటాయి అని అన్నాడు. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటకకు బీ ఆర్ఎస్ వెళ్తే తెలుగుదేశం పార్టీ కూడా వెళ్తుంది అని..
Telangana News: హాట్ టాపిక్ గా మారిన జగ్గా రెడ్డి వ్యాఖ్యలు..
ఇక బీ ఆర్ ఎస్ తో కేసీఆర్ విజయం సాధించే పరిస్థితి లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు జగ్గారెడ్డి. ఇక జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఇతర నాయకులు కూడా జగ్గారెడ్డి మాటలకు సపోర్టుగా నిలిచారు. మరి జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ ఏమని స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం తెలంగాణలో మాత్రం కేసీఆర్ తీరు పట్ల ప్రజలు కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.