Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోగా ఉన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్త తరహా రాజకీయాలకు మార్గం వేస్తాడని, ఎలాంటి పరిస్థితుల్లోను పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఇప్పుడు ఉన్న చీప్ రాజకీయ నాయకుల్లా మారాడని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు చూస్తేంటే మాత్రం పవన్ ను క్కూడా ఇప్పుడున్న చిల్లర రాజకీయాలు మార్చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రధాని మోడీతోనే తన రాజకీయ చతురతను చూపిస్తున్నారు. నేరుగా మోడీతోనే భేటీ అయినప్పటికీ మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతూ తన ప్రస్థానానికి బలమైన పునాదులు వేస్తున్నారు.
వచ్ఛే ఎన్నికల్లో ఎలాగైనా రెస్పెక్టబుల్ స్థానాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్రను పోషించడానికి జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీతో జరిగిన భేటీ మాత్రం పవన్ కోరికకు అడ్డుకట్టలు పడ్డట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికలో పోటీకి దిగటానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించిన భేటీలు కూడా ముగిశాయని, అధికార ప్రకటన మాత్రమే మిగిలిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ వ్యూహానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా తమతోనే ఉండాలని, టీడీపీతో పొత్తు వద్దనే మోడీ పవన్ కు చెప్పాడని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు రాజకీయంగా చాలా ముదిరారు కాబట్టి వచ్చే మోడీ మాటను, బీజేపీ మాటను కూడా పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని రాజకీయంగా ఎదగటానికి జనసేన శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెస్పెక్టబుల్ స్థానాల్లో గెలవాలంటే టీడీపీతో పొత్తు ఉండాలని రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ కు సూచిస్తున్నారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగానే పవన్ కు సూచనలు చేస్తున్నారని సమాచారం. మోడీకే ఎదురు వెళ్లేంత ధైర్యం జనసేనకు ఎక్కడ నుండి వస్తుందో అర్థం కావడం లేదు.