Shivani Rajashekar : కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి… ఫొటో షూట్ లో ఎంత అందాలు ఆరబోస్తే అంత అవకాశాలు వాళ్ళ సొంతం… దీంతో ఇండస్ట్రీలో రాణించాలనుకునే ముద్దుగుమ్మలు రెచ్చిపోతున్నారు. ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ.. సోషల్ మీడియాని షేక్ ఆడిస్తునారు. తాజాగా ఆ జాబితాలో రాజశేఖర్-జీవిత ల ఇద్దరూ కూతుర్లు శివాని, శివాత్మిక కూడా చేరిపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ… తాజాగా అందాలతో కుర్రకారు మతి పోగోడుతున్నారు.
అందాలు ఆరబోయడమే పనిగా పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మలు… ఫోటో షూట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నారు. అయితే శివాని ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో కొన్ని అటు పోట్లను ఎదుర్కొంది. అద్భుతం అనే మూవీ తో వెండితెరకు పరిచయమైన శివాని.. ఆ తర్వాత డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాల్లో ఒక తమిళ్ చిత్రంలో నటిస్తుంది. అలాగే పలు వెబ్ సిరీస్ లతో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శివాత్మిక. ఈ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. కానీ శివాత్మిక ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. నటించింది మొదటి చిత్రమే అయినా… దొర కూతురు పాత్రలో శివాత్మిక అద్భుతమైన నటనను కనబరిచింది. అయితే ఈ బ్యూటీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న… మూవీ ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రస్తుతం ఇండస్ట్రీలో బుల్లి బుల్లి అడుగులు వేస్తూ… తన కెరీర్ ని నెట్టుకొస్తుంది శివాత్మిక… ప్రస్తుతం ఈమె రంగమార్తాండ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.