AP News: ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోలీసులు కూడా పక్షపాతం లేకుండా ప్రవర్తించడం మానేసి వైసిపి నాయకులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేశారు.ఆలూరి రంగనాథ స్వామి వేడుకలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వేడుకలలో పాల్గొనడం కోసం జెసి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. అయితే అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురయింది.ఈ క్రమంలోనే సుమారు రెండు గంటల సమయం పాటు జెసి ప్రభాకర్ రెడ్డి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులు వైసిపి నాయకులకు కొమ్ము కాస్తున్నారంటూ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలూరి రంగనాథుని రథోత్సవంలో పాల్గొన్నారు. అయితే అక్కడఎద్దుల పోటీలలో కేతిరెడ్డి పెద్దారెడ్డి బిజీగా ఉన్నారు అదే సమయంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి సైతం స్వామివారి దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయనని అడ్డుకున్నారు.ప్రస్తుతం రథోత్సవంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారని ఇప్పుడు మీరు హాజరు కావడానికి వీలు లేదు అంటూ పోలీసులు అడ్డుకున్నట్లు తెలిపారు.
AP News:
ఈ విధంగా ఇద్దరు ఒకేసారి రథోత్సవం లో పాల్గొనడం వల్ల ఇరు వర్గాల ప్రజల మధ్య గొడవలు చోటుచేసుకుంటాయని పోలీసులు చెబుతున్నప్పటికీ ప్రభాకర్ రెడ్డి వినకపోవడంతో 41 నోటీసులను ఇచ్చి తనని ఇంటిలోకి బలవంతంగా పంపించారని తెలిపారు. అయితే పోలీసుల వ్యవహారి శైలి పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజా కార్యక్రమాలకు వెళ్లకుండా చేసే ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్న తీరుపై దివాకర్ రెడ్డి స్పందించారు. ఈ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత లోకేష్ పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అలాగే జగన్ ప్రభుత్వం పై దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సెటైర్లు వేశారు.ఇక కేతిరెడ్డి దర్శనం అనంతరం పోలీసులు జెసి ప్రభాకర్ రెడ్డిని అనుమతించడంతో ఈ విషయంపై జేసీ సోదరులతో పాటు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు అధికార ప్రభుత్వం పై మండిపడుతున్నారు.