Hero Rana: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ముందుగా చిన్నచిన్న సినిమాలతో నటించి, మెప్పించి ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన సినిమాలో నటించే స్టేజ్ కు ఎదిగాడు. బాహుబలి సినిమాతో మంచి పేరును తెచ్చుకున్నాడు. అంతకుముందు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అంతగా పేరు రాలేదు. బాహుబలి లో విలన్ గా చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత ఇతడికి వరుసగా విలన్ పాత్రలే వచ్చాయి. రానా వెండితెర లోనే కాదు బుల్లితెరలో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బుల్లితెరలో కొన్ని షోలలో వ్యాఖ్యాతగా చేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో కూడా విలన్ గా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమారుడు రానా దగ్గుపాటి. రెండవ కుమారుడు అభి రామ్ దగ్గుపాటి. తాజాగా ఈ కుటుంబం తిరుమలలో శ్రీ వారిని దర్శించడానికి వచ్చింది. సురేష్ బాబు ఆయన సతీమణి, అలాగే రానా ఆయన సతీమణి , అభిరామ్ తిరుమలకు వచ్చారు. నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరంతా స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఆలయ అధికారులు వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలకడమే కాకుండా స్వామివారి దర్శనం అనంతరం పండితులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా స్వామివారి దర్శనం కోసం రానా ఆయన సతీమణి మీహిక ఆలయం వెలుపలకు రావడంతో ఒక్కసారిగా మీడియా.. వారిపై ఫోకస్ చేశారు. ఆ సమయం లో ఓ అభిమాని రానాతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు.
Hero Rana: ఫోన్ లాక్కొని అభిమాని పై సీరియస్..
ఇలా హీరో రానాను సెల్ఫీ అడగడంతో రానా ఏకంగా తన అభిమాని మొబైల్ ఫోన్ లాక్కొని సీరియస్ అయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి చెయ్యవద్దు అని చెప్పారు. ఆ తర్వాత తిరిగి తన అభిమాని ఫోన్ తనకు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.